News December 10, 2025
వరంగల్: మక్కలు క్వింటాకి రూ.2,105

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి బుధవారం మొక్కజొన్న తరలివచ్చింది. ఈ క్రమంలో గత వారంతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర పెరిగింది. గతవారంలో మక్కలు(బిల్టీ) క్వింటాకు గరిష్ఠంగా రూ.2,020 ధర రాగా.. నేడు రూ.2,105 అయింది. దీంతో మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, క్వింటా పచ్చి పల్లికాయకు రూ.5,300 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News December 13, 2025
15న విశాఖలో వైసీపీ కోటి సంతకాల ర్యాలీ: కేకే.రాజు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమానికి పలు వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని జిల్లా అధ్యక్షుడు కేకే.రాజు అన్నారు. శనివారం YCP కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 15న GVMC గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లన్నున్నట్లు తెలిపారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం వినతి పత్రాలను తాడేపల్లికి ఆరోజు పంపనున్నట్లు చెప్పారు.
News December 13, 2025
వనపర్తి: రెండో విడత ఎన్నికలకు భారీ భద్రత: ఎస్పీ

వనపర్తి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1,150 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఆదివారం 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.
News December 13, 2025
యాదగిరిగుట్ట: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఒక మాసంపాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ధనుర్మాస ఉత్సవ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి ఉదయం 5 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపంపై ఉత్తర భాగాంలోని హాలులో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.


