News December 10, 2025
కరీంనగర్: మూడో విడతతో 20 GPలు ఏకగ్రీవం

గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల్లో 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. జగిత్యాల జిల్లాలో 6, సిరిసిల్ల – 7, కరీంనగర్ – 1, పెద్దపల్లి జిల్లాలో 6 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా, మొదటి విడత రేపు పోలింగ్ జరగనుండగా, రెండో విడత 14న, విడత మూడో విడత 17న పోలింగ్, అదేరోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు.
Similar News
News March 10, 2026
HNK: ప్రమాదాల నివారణకు రోడ్డుకు ఇరువైపులా సైడ్ లైన్లు: కలెక్టర్

హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన రహదారులకు ఇరువైపులా సైడ్ లైన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 60 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, అక్కడ తక్షణమే మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కాలపరిమితి ముగిసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.
News March 10, 2026
సిరిసిల్ల: జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన క్రీడాకారిణి ఎంపికైంది. గ్రామానికి చెందిన గుంటుక లయ హైదరాబాద్లోని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఓయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీల్లో లయ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఓయూ ఉమెన్స్ టీం తరఫున పోటీల్లో పాల్గొననుంది.
News March 10, 2026
ఇరాన్పై యుద్ధం దాదాపుగా పూర్తయింది: ట్రంప్

ఇరాన్పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని US ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసేందుకు 4-5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే పూర్తి కాబోతున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్కు ఇప్పుడు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఏవీ లేవని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ట్రంప్ ఫోన్ కాల్లో చర్చించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.


