News December 10, 2025
అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు: మంత్రి సంధ్యారాణి

రాష్ట్ర వ్యాప్తంగా 58,746 అంగన్వాడీ కార్యకర్తలుకు 5జీ మొబైల్ ఫోన్లు ఉచితంగా అందిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టబడి ఉందని ఆమె తెలిపారు.
Similar News
News January 13, 2026
KNR: ఖాకీపై ‘ఖాదీ’ ఒత్తిడి.. సీపీ అకస్మాత్తు సెలవు

అవినీతిపై కఠినంగా వ్యవహరించిన కరీంనగర్ సీపీకి రాజకీయ సెగ తగిలింది. ఇసుక మామూళ్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎస్సైని సస్పెండ్ చేయగా, సదరు అధికారిని వెనకేసుకొస్తూ స్థానిక ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ల ద్వారా ఒత్తిళ్లు పెరగడంతో విసుగు చెందిన సీపీ విధులకు దూరంగా ఉంటూ సోమవారం నుంచి సెలవుపై వెళ్లారు. పోలీసు వర్గాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
News January 13, 2026
భోగి పర్వదినాన గోదా రంగనాథ కళ్యాణం

భోగి పర్వదినాన ఆండాళ్ అమ్మవారు-శ్రీ రంగనాథ స్వామి దివ్య కళ్యాణం నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఈ కళ్యాణం ద్వారా వివాహ అడ్డంకులు తొలగి, దాంపత్య అన్యోన్యత పెరిగి, కుటుంబంలో శాంతి, శుభమంగళాలు స్థిరపడతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ అరుదైన పుణ్యావకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేదమందిర్లోనే గోదా రంగనాథుల అనుగ్రహాన్ని పొందండి. ఇవాళే మీ పేరు, గోత్రంతో సంకల్పం <
News January 13, 2026
చౌటుప్పల్: విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం

చౌటుప్పల్ సమీపంలోని ధర్మోజిగూడెం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ నరేశ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. సంక్రాంతి వేళ క్రైమ్ బీట్ డ్యూటీలో భాగంగా రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ మన్మథ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేశ్ది మునగాల మండలం తాడువాయి.


