News December 11, 2025
చిత్తూరు కలెక్టర్కు 6వ ర్యాంకు

రాష్ట్రంలోనే అందరి కంటే ఎక్కువగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఎక్కువ ఫైల్స్ స్వీకరించారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 1,555 ఫైల్స్ తీసుకుని 1,421 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్ను ఒకరోజు 6గంటల వ్యవధిలోనే క్లియర్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు మన కలెక్టర్కు రాష్ట్రంలో 6వ ర్యాంకు ఇవ్వగా.. 843 ఫైల్స్కు గాను 740 క్లియర్ చేయడంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్కు 12వ ర్యాంకు వచ్చింది.
Similar News
News April 2, 2026
చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కో టిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమావేశాలు నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు విక్రయించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు.
News April 2, 2026
వాటి జోలికెళితే డేంజర్: చిత్తూరు SP

లోన్ యాప్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. తెలియని యాప్ల ద్వారా రుణాలు పొందితే వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పెట్టినట్లేనని ఆయన హెచ్చరించారు. లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా మాత్రమే రుణాలు పొందాలని సూచించారు.
News April 2, 2026
చిత్తూరు: శాంతించిన మామిడి రైతులు

చిత్తూరు నగరం వేంగారెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు 2 రోజులపాటు ఆందోళన చేపట్టారు. మామిడి పంట తరలించి ఏడాది గడుస్తున్నా.. ఇంత వరకు డబ్బులు చెల్లించలేదని రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్నారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం నిరసన స్థలానికి చేరుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులతో చర్చించింది. ఏప్రిల్ 7లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించడంతో రైతులు నిరసనలను విరమించారు.


