News December 11, 2025
గిద్దలూరు: రాజకీయంలో పిడతల కుటుంబం

గిద్దలూరు రాజకీయ ముఖ చిత్రంలో పిడతల కుటుంబం ప్రాధాన్యత అధికం. పిడతల రంగారెడ్డి 1937 నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్గా పదవులు చేపట్టారు. 1991లో ఈయన కన్నుమూశారు. 1994 ఎన్నికల్లో పిడతల రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ రెడ్డి గెలవగా.. 2001లో ఈయన మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. ఈయన సతీమణి సాయికల్పన ఎమ్మెల్యే అయ్యారు.
Similar News
News March 20, 2026
అందాల పోటీలు.. మార్కాపురం యువతికి కిరీటం

మార్కాపురానికి చెందిన శ్రీరంగం నరసింహచార్యులు కుమార్తె దీప్తి ప్రతిభ చూపింది. హైదరాబాద్లో మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా-2026 కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఫ్యాషన్ షోలో 500 మంది పైగా పాల్గొన్నారు. దీప్తి విజేతగా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా రూ.3లక్షల ప్రైజ్ మనీ,కిరీటాన్ని అందుకున్నారు.
News March 20, 2026
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.
News March 20, 2026
రేపు మార్కాపురంలో జాబ్ మేళా

మార్కాపురంలోని జార్జి ఫార్మసీ కళాశాలలో రేపు జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. B. Pharmacy, M. Pharmacy, B.Sc, M.Sc, B.Tech విద్యార్హతలు కలిగిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, పాస్ ఫోటోలు అలాగే జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


