News December 11, 2025

ఆదిలాబాద్‌ జిల్లాలో 40.37% పోలింగ్ నమోదు

image

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో 35.61%, సిరికొండ 60.21%, ఇంద్రవెల్లి 33.14%, ఉట్నూర్ 38.59%, నార్నూర్ 45.11%, గాదిగూడలో 53.77% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.

Similar News

News January 11, 2026

ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి: కేటీఆర్

image

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు వారికి దిశా నిర్దేశం చేశారు. జిల్లా అద్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కోవలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ మాజీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

News January 11, 2026

నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: వెడ్మ బొజ్జు

image

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ప్రఖ్యాత నాగోబా ఆలయాన్ని శనివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. స్థానికంగా నిర్వహించే జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ప్రఖ్యాత నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

News January 10, 2026

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు: ADB SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే మూఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలన్నారు. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.