News April 20, 2024
అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పన్న పెండ్లి కుమారుడిగా శ్రీదేవి భూదేవి పెళ్లి కుమార్తెలుగా దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణాన్ని జరిపించారు. ఎదురు సన్నాయి ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.
Similar News
News March 10, 2026
విశాఖ, ఉప్పాడలో కోత నివారణ పనులు

విశాఖ, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. విశాఖ తీర రక్షణ కోసం రూ.203 కోట్ల ప్రాజెక్టుకు తుది అనుమతులు లభించాయి. అలాగే ఉప్పాడ తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్రం రూ.323 కోట్లు మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదించిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ద్వారా తీరం వెంబడి 5 కి.మీ.ల మేర మొక్కలు నాటి ప్రకృతి సిద్ధమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు.
News March 10, 2026
అగనంపూడి హైవేపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

అగనంపూడి టోల్గేట్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అగనంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు బలిరెడ్డి కిషోర్ ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన మైలురాయిను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.
News March 10, 2026
విశాఖలో సెయింట్ గోబైన్ జిప్రాక్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం

సెయింట్ గోబైన్కు చెందిన జిప్రాక్ విభాగం విశాఖలో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. 2025 డిసెంబరులో ప్రారంభమైన ఈ ఆధునిక కేంద్రం దేశంలోనే తక్కువ కార్బన్ ఉద్గారాలతో పనిచేసే జిప్సం పైకప్పు పలకల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందింది. సంవత్సరానికి సుమారు 50 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ పెట్టుబడి భారతదేశంలో తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


