News April 20, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో డాక్టర్ ఎమ్మెల్యే రాగమయి పర్యటన
….
Similar News
News March 10, 2026
ఖమ్మంలో మార్చి 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ

ఖమ్మంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం సర్పంచ్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, వార్డు కౌన్సిలర్లకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం సీఎస్ కె.రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అవగాహన కల్పించారు.
News March 10, 2026
ఖమ్మం జిల్లాలో తొలి ‘కుసుమ్’ సోలార్ ప్లాంట్ ప్రారంభం

తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో ప్రధానమంత్రి కుసుమ్ (PM-KUSUM) పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్స్ సౌర విద్యుత్ ప్లాంట్ను మంగళవారం ప్రారంభించారు. రైతు బీరవల్లి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గ్రిడ్కు అనుసంధానం చేశారు. జిల్లాలో ఈ పథకం కింద ప్రారంభమైన తొలి సోలార్ ప్లాంట్ ఇదే. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News March 10, 2026
ఖమ్మం: ఇంటర్ పరీక్షలో విద్యార్థిపై మాల్ప్రాక్టీస్ కేసు

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్కు పాల్పడిన ఓ విద్యార్థిపై మాల్ప్రాక్టీస్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని ఓ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డీఐఈఓ రవిబాబు వెల్లడించారు. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,849 మంది హాజరుకాగా, 502 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


