News December 11, 2025
నిర్మల్: ‘ఎన్నికల విధులకు తప్పకుండా హాజరు కావాలి’

జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. విధులకు హాజరు కానీ ఉద్యోగులపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె సూచించారు. మొదటి విడతలో విధులకు హాజరు కాని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
Similar News
News March 31, 2026
నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2న వైన్స్ బంద్: సీపీ

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2న వైన్ షాపులు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశించారు. ఏప్రిల్ 2 ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 3 ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 31, 2026
బాపట్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన కర్లపాలెం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఎట్రా వారిపాలెం గ్రామ శివారులోని మురుగు కాలువ వద్ద లంక కాలువ కట్టకు చెందిన అద్దూరి వెంకట్రావు చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 31, 2026
జూపూడిలో గంజాయి విక్రయ స్థావరంపై దాడి

పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలతాడిపర్రు శివారు జూపూడి పొలాల్లో గంజాయి విక్రయం, వినియోగ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.250 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 5గ్రాముల ప్యాకెట్ రూ.500కి విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.


