News April 20, 2024

రంగారెడ్డి: ఇప్పటివరకు 757 చోట్ల తనిఖీలు

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 757 చోట్ల తనిఖీ నిర్వహించారు. వీటిలో రూ.7,32,95,639 విలువ చేసే నగదుతో పాటు, మద్యం ఇతర వస్తువులు పట్టుబడినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి శశాంక తెలిపారు. అధికారులకు పట్టుబడిన దానిలో రూ.2,88,74,708 నగదు సహా రూ.4,18,700 కేజీల వెండి, చీరలు, మద్యం, డ్రగ్స్ ఇతర వస్తువులు పట్టుబడినట్లు తెలిపారు.

Similar News

News March 7, 2026

రంగారెడ్డి: బాలికలకు రేపు HPV

image

బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన HPV టీకా కార్యక్రమ అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఈ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ అధికారికంగా ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలిత దేవి తెలిపారు. అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

News March 7, 2026

రేపటి నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ: డీఎంహెచ్‌ఓ

image

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ లలిత తెలిపారు. శనివారం ఆమె ఆమనగల్లులో మాట్లాడుతూ.. మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు 4 విడతల్లో చేస్తామని వెల్లడించారు. అలాగే, రేపటి నుండి జిల్లావ్యాప్తంగా హెచ్‌పీవీ(HPV) వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

News March 6, 2026

RR: మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆరుగురు స్టూడెంట్స్

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నిఘా నీడలో ద్వితీయ సంవత్సర పరీక్షలు కొనసాగాయి. 67,578 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 66,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 1,087 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా, ఒకే సెంటర్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులు స్క్వాడ్‌కు పట్టుబడ్డారు.