News December 11, 2025
మొగల్తూరు: వృద్ధురాలిపై అత్యాచారయత్నం

మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నం జరిగింది. గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఆమె కొబ్బరి తోటలో ఈనులు చీరుకుంటున్న సమయంలో పెద్దిరాజు(30) ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 15, 2026
ఈనెల 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు: కలెక్టర్

పెదమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార గోడపత్రికను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆమె తెలిపారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.
News March 15, 2026
ప.గో: బండిపై వెళ్తుంటే భార్య గొంతు కోశాడు.. అసలేం జరిగింది?

భార్య గొంతు కోసిన భర్తను తణుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం సజ్జాపురానికి చెందిన కరగాని దిల్లేశ్వరి బండిపై వెళ్తుండగా, వెనుక కూర్చున్న భర్త గోవిందు బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మనస్పర్ధల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గోవిందును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తీవ్ర గాయాలైన దిల్లేశ్వరికి చికిత్స అందుతోంది.
News March 15, 2026
హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ.. పాల్గొన్న ఏలూరు ఎంపీ!

HYD మొయినాబాద్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్లో శనివారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంలో పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో పార్టీలోని ఒకరు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న 9 మందిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఉన్నారు. ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. రోహిత్ సహా ఐదుగురికి పాజిటివ్గా తేలింది.


