News December 11, 2025
సెన్సార్ బోర్డుపై నటుడి కామెంట్స్.. సారీ చెప్పిన మేకర్స్

‘మోగ్లీ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో విలన్ పాత్రలో నటించిన బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన పర్ఫార్మెన్స్ చూసి సెన్సార్ బోర్డు అధికారి భయపడటంతోనే ‘A’ సర్టిఫికెట్ వచ్చిందని ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నిర్మాణసంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ X వేదికగా స్పందించింది. నటుడు నోరు జారడంపై సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెబుతూ, ఆ ఫుటేజీని తొలగిస్తామని ప్రకటించింది. అటు సరోజ్ కూడా సారీ చెప్పారు.
Similar News
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News January 3, 2026
చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.


