News December 11, 2025

విశాఖ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా వన్నం రెడ్డి సతీష్ కుమార్

image

రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ ఛైర్మన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా గ్రంథాలయం ఛైర్మన్‌గా తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు వనం రెడ్డి సతీష్ కుమార్‌ నియమితులయ్యారు. జనసేనలో క్రియాశీలకంగా పని చేసిన సతీష్ కుమార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో నేరుగా సంభాషిస్తూ పార్టీ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

Similar News

News January 3, 2026

విశాఖ: సొంత భవనంలోకి NIO ప్రాంతీయ కార్యాలయం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫి విశాఖ ప్రాంతీయ కార్యాలయం త్వరలో సొంత భవనంలోకి మారనుంది. సముద్ర తీర పరిశోధనల కోసం 1976 నుంచి పెదవాల్తేరు బస్‌ డిపో సమీపంలో అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీచ్‌ రోడ్డులోని రాడిసన్ బ్యూ రిసార్ట్ సమీపంలో 3 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 3, 2026

విశాఖ: న్యూఇయర్ రోజు మర్డర్.. కారణం ఇదేనా?

image

విశాఖ జిల్లా కాకానినగర్‌లో న్యూఇయర్ రోజు <<18740809>>దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్‌ తమను తిట్టాడనే కారణంతో ఈ ఇద్దరు యువకులు కర్రలతో దాడి చేసి చంపినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ శంకర్ నారాయణ శనివారం తెలిపారు.

News January 3, 2026

విశాఖ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

విశాఖ జిల్లాలో 20 ఉద్యోగాలకు ప్రభుత్వం <>నోటిఫికేషన్<<>> ఇచ్చింది. కేజీబీవీ టైప్-3 విభాగంలో 06, టైప్-4 విభాగంలో 14 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.