News April 20, 2024
నందిగాం: బైక్ మీద నుంచి జారిపడి మహిళ మృతి

నందిగం మండలం పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజిని(48) కుమారుడు రమేష్కు ఈనెల 24న వివాహం నిశ్చయమైంది. పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు కుమారుడుతో కలిసి శుక్రవారం బైక్ పై పలాస వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో జారిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 5 రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.
Similar News
News January 13, 2026
కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.


