News April 20, 2024

గోదావరిలో దూకి 26ఏళ్ల యువతి సూసైడ్

image

కొవ్వూరు రోడ్డు, రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకి యువతి మృతి చెందింది. రాజమండ్రి శాటిలైట్‌ సిటీ ఏరియాకు చెందిన భార్గవి(26) ఓ బ్యాంకులో పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన భార్గవి తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిలో ఎవరో దూకినట్లు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టగా ఆమె మృతదేహం లభ్యమైంది.

Similar News

News March 28, 2026

ఆకివీడు ఆలయం వద్ద కంచె.. మోహరించిన బలగాలు

image

ఆకివీడు పెదపేటలోని శిథిలావస్థకు చేరిన ఆలయం వద్ద శ్రీరామనవమి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా, భక్తులు లేదా ఇతర వ్యక్తులు ఎవరూ ఆలయం లోపలికి వెళ్లకుండా అధికారులు ఆలయం చుట్టూ ఇనుప కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. భారీగా పోలీసు బలగాలు మోహరించి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

News March 28, 2026

నరసాపురం: కారు ఇప్పిస్తానని బంధువుకే టోకరా..!

image

తక్కువ ధరకే కారు కొనిపిస్తానని నమ్మించి రూ.4.50 లక్షలు కాజేసిన వ్యక్తిపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ముత్యాలరావు వివరాలు.. బాధితుడు యర్లగడ్డ ప్రదీప్ కుమార్‌కు బంధువైన గాబ్రియేల్ రాజు(హైదరాబాద్), వివిధ విడతల్లో నగదు తీసుకుని మోసగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు కొనివ్వకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే నిరాకరించడంతో ప్రదీప్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు.

News March 28, 2026

భీమవరం కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

image

ఈనెల 28న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పింఛన్లు వంటి అంశాలపై ప్రతిభావంతులు తమ అర్జీలను అందజేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.