News December 12, 2025
4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్

TG: ఫుట్బాల్ తనకు ఇష్టమైన ఆట అని CM రేవంత్ తెలిపారు. ‘టీం స్పిరిట్ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. TG టీంకు లీడర్గా 4కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి(D) సదాశివపేట్ కంకోల్లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశా’ అని ట్వీట్ చేసి ఫొటోలను షేర్ చేశారు. రేపు ఉప్పల్లో మెస్సీ టీంతో రేవంత్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.
Similar News
News March 11, 2026
APPLY: డిగ్రీతో నెలకు రూ.50వేల జీతం

IDBIలో 1,300 పోస్టులకు ఈ నెల 19న దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. జూ.అసిస్టెంట్ మేనేజర్ ‘గ్రేడ్-ఓ’ ఉద్యోగాలకు డిగ్రీలో కనీసం 60% ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ‘గ్రేడ్-ఏ’ పోస్టులకు డిగ్రీతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. 1 మార్చి 2026 నాటికి వయసు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
వెబ్సైట్: <
News March 11, 2026
‘ధురంధర్-2’ రన్టైమ్ ఎఫెక్ట్.. టికెట్ రేట్లు పెరుగుతాయా?

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ మూవీ రన్టైమ్ 3 గంటల 55 నిమిషాలు (దాదాపు 4 గంటలు) ఉండటం చర్చనీయాంశమైంది. ఇది మల్టీప్లెక్సులకు సవాల్గా మారినట్లు తెలుస్తోంది. భారీ రన్టైమ్ వల్ల షోల సంఖ్య తగ్గిపోతుందని.. ఫలితంగా డైలీ గ్రాస్పై ఎఫెక్ట్ పడుతుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దానిని భర్తీ చేసేందుకు టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఆడియన్స్కు భారంగా మారుతుంది.
News March 11, 2026
‘హార్ముజ్’ దాటాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే: ఇరాన్

ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఇండియాకు వెళ్తున్న థాయిలాండ్ <<19355576>>కార్గో షిప్పై దాడి<<>> చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. ‘హార్ముజ్ గుండా ఒక్క లీటర్ ఆయిల్ను కూడా వెళ్లనివ్వం. ఈ జలసంధి నుంచి వెళ్లాలంటే కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు. ముడి చమురు బ్యారెల్ రేట్ 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఇరాన్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది.


