News December 12, 2025
కరీంనగర్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లోని 92 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 81.82 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
Similar News
News March 11, 2026
KNR: ‘డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్కు దూరంగా ఉండాలి’

డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.
News March 11, 2026
KNR: ప్రజాప్రతినిధులకు ‘ప్రగతి’ పాఠాలు

‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’పై కరీంనగర్ జిల్లా లోని సర్పంచ్, కార్పొరేటర్లకు (రేపు) గురువారం నిర్వహించనున్న శిక్షణను విజయవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. 10 ప్రధానాంశాలతో కూడిన 99 రోజుల కార్యాచరణ, విధివిధానాలు, ఆదాయ వనరుల పెంపుపై స్లైడ్లు, వీడియోలతో ఆకట్టుకునేలా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. జిల్లాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్నారు.
News March 11, 2026
KNR: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనాన్ని మరో బైకు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీగలగుట్టపల్లికి చెందిన మిట్టపల్లి వెంకటస్వామి తన వాహనంపై కరీంనగర్ వస్తుండగా, రాగంపేటకు చెందిన రాజకుమార్ అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన వెంకటస్వామి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


