News December 12, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లోని 85 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 79.57 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

Similar News

News March 15, 2026

రాజంపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికుల తిప్పలు

image

తిరుపతి వెళ్లడానికి ఆదివారం సాయంత్రం బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. 2 గంటల సేపు వేచిఉన్న తర్వాత వేరే డిపో బస్సు వచ్చిందన్నారు. అది కూడా అధిక ప్రయాణికులతో నిండుగా రావడంతో సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజంపేట డిపో నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలానికి రాత్రి పూట లగ్జరీ/ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 15, 2026

రాజంపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికుల తిప్పలు

image

తిరుపతి వెళ్లడానికి ఆదివారం సాయంత్రం బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. 2 గంటల సేపు వేచిఉన్న తర్వాత వేరే డిపో బస్సు వచ్చిందన్నారు. అది కూడా అధిక ప్రయాణికులతో నిండుగా రావడంతో సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజంపేట డిపో నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలానికి రాత్రి పూట లగ్జరీ/ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 15, 2026

జమ్మికుంట మార్కెట్‌ రేపు తిరిగి ప్రారంభం

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, నేడు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నారు.