News December 12, 2025

ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఏర్పాట్లు పూర్తి

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 155 గ్రామపంచాయతీలు, 1392 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.

Similar News

News April 19, 2026

AP రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

image

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్‌లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

News April 19, 2026

పవన్‌ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదేనా?

image

AP Dy.CM పవన్ కళ్యాణ్‌ ముక్కుకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.

News April 19, 2026

ఉండవెల్లి: అన్నపై గొడ్డలితో తమ్ముడు దాడి..!

image

ఉండవెల్లి మండలంలో ప్రగటూరులో రక్తసంబంధం మంటగలిసింది. చిన్నపాటి వివాదాలు కాస్తా హత్యాయత్నానికి దారితీశాయి. శనివారం అన్నదమ్ముల మధ్య పాత గోడ కూల్చివేత విషయంలో జరిగిన గొడవలో తమ్ముడు శేఖర్ తన అన్న మల్లేష్‌పై గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో మల్లేష్ చేతికి తీవ్ర గాయమవ్వగా ఉండవెల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.