News December 12, 2025

దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

image

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Similar News

News March 15, 2026

మచిలీపట్నంలో రేపు మీకోసం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.

News March 15, 2026

కృష్ణా: కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కొరత.. భారంగా హోటల్స్ నిర్వహణ

image

కృష్ణా జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కొరత ఏర్పడింది. గత వారం రోజులుగా హోటల్స్ & రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హోటల్స్ నిర్వహణ భారంగా మారిందని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉండగా సిలెండర్ల కొరతను అదునుగా చూసుకొని కొంత మంది అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తెర లేపారన్న విమర్శలు విపినిస్తున్నాయి.

News March 15, 2026

మచిలీపట్నంలో చికెన్ ధరల హీట్.. కేజీ ఎంతంటే!

image

మచిలీపట్నం మాంసం మార్కెట్లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. పట్టణ ప్రాంతంలో మటన్ ధర కేజీ రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.300 పలుకుతోంది. చేపల మార్కెట్‌లో బొచ్చె కిలో రూ.200, సీలావతి రూ.170కి విక్రయిస్తున్నారు. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.