News December 12, 2025
సంగారెడ్డి: రెండో విడత.. 229 స్థానాలకు 649 మంది పోటీ

సంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి. పది మండలాల్లోని 229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా మొత్తం 649 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. చెప్పారు. 1,941 వార్డు స్థానాలకు 4,526 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
Similar News
News January 3, 2026
GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.


