News December 13, 2025
చిత్తూరు: మొదటిసారి నిర్ణయం.. 9 మంది మృతి

అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం 9మంది ఆయువు తీసింది. చిత్తూరు <<18539726>>బస్సు ప్రమాద<<>> ఘటనలో.. ట్రావెల్స్ యజమాని 1993 నుంచి ఈ రంగంలో ఉన్నారు. పన్నీరుసెల్వం వజ్రమణి(ఏజెంట్) ద్వారా యాత్రలు చేపడుతుంటాడు. 22 ఏళ్లలో ఎప్పుడూ వజ్రమణి రాత్రి ప్రయాణం చేయలేదట. టూర్ ఆలస్యం కావడంతో మొదటిసారి రాత్రి ప్రయాణం చేశారంట. భద్రాచలం యాత్ర సైతం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమంట. పొగమంచు, అతివేగం సైతం 8 కుటుంబాల్లో విషాదం నింపింది
Similar News
News January 3, 2026
GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.


