News December 13, 2025
కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.
Similar News
News March 25, 2026
ఒంటిమిట్ట: ధ్వజారోహణం కోసం చాప సమర్పణ

మార్చి 27న జరగనున్న ధ్వజారోహణం కోసం ఉపయోగించనున్న పవిత్ర దర్బారు చాప, తాళ్లను ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం లాంఛనప్రాయంగా సమర్పించారు. TTD అటవీ అధికారులు ఈ పవిత్ర చాపను, తాళ్లను ఒంటిమిట్ట ఆలయ అధికారులకు అందజేశారు. TTD అటవీ సిబ్బంది రూపొందించిన ఈ 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు,60 కిలోల బరువు గల దర్బారు చాప, 225 మీటర్ల తాళ్లను సాధారణంగా ప్రతి ఏటా ధ్వజారోహణం వేడుక కోసం ఉపయోగిస్తారు.
News March 25, 2026
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత: కడప SP

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు SP S.నచికేత్ విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన TTD JEO వీరబ్రహ్మం, TTD విజిలెన్స్ SP మురళీ కృష్ణతో కలిసి భద్రతా ఏర్పాట్ల ప్రదేశాలను పరిశీలించారు. ఒంటిమిట్ట రామాలయం, కళ్యాణ వేదిక, CM గెస్ట్ హౌస్, మాడ వీధుల్లో చేపట్టాల్సిన భద్రత విషయాలను చర్చించారు. రామయ్య కళ్యాణం రోజు సుమారు 2100 మంది పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు.
News March 25, 2026
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత: కడప SP

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు SP S.నచికేత్ విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన TTD JEO వీరబ్రహ్మం, TTD విజిలెన్స్ SP మురళీ కృష్ణతో కలిసి భద్రతా ఏర్పాట్ల ప్రదేశాలను పరిశీలించారు. ఒంటిమిట్ట రామాలయం, కళ్యాణ వేదిక, CM గెస్ట్ హౌస్, మాడ వీధుల్లో చేపట్టాల్సిన భద్రత విషయాలను చర్చించారు. రామయ్య కళ్యాణం రోజు సుమారు 2100 మంది పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు.


