News December 13, 2025

HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్‌నుమా

image

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస ఏర్పాటు చేసింది. ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్‌గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్‌ను లీజ్ తీసుకుంది.

Similar News

News January 13, 2026

తల్లిదండ్రుల అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలి: SC

image

తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BV నాగరత్న కోరారు. ‘తమ తల్లిదండ్రులు ఆదాయానికి మించి సంపాదించిన దేన్నైనా పిల్లలు తీసుకోకూడదు. వాటికి లబ్ధిదారులుగా ఉండొద్దు. ఇది దేశానికి చేసిన గొప్ప సేవ అవుతుంది’ అని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏకు చట్టబద్ధతపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

News January 13, 2026

BREAKING: యాదాద్రి: అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు

image

భూరిజిస్ట్రేషన్ల ఛార్జీల చెల్లింపుల్లో అక్రమాలపై యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, వలిగొండ PSలలో తహశీల్దార్లు ఈరోజు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ల ఫిర్యాదు మేరకు 4 PSలల్లో ఇంటర్‌నెట్ సెంటర్ల నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు 19 మందిపై కేసులు నమోదు చేశారు. వలిగొండ రూ.15 లక్షలు యాదగిరిగుట్ట రూ.72 లక్షలు, బొమ్మలరామారంలో రూ.25 లక్షలు, తుర్కపల్లిలో రూ.14 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు.

News January 13, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ చైనా మాంజా వాడొద్దు: మణుగూరు DSP
✓ చుంచుపల్లి: పాఠశాల వద్ద హైటెన్షన్ ముప్పు
✓ సుజాతనగర్: ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ
✓ అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
✓ ఈనెల 16, 17న పాల్వంచ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
✓ దుమ్ముగూడెం: హెల్త్ సెంటర్లను తనిఖీ చేసిన DMHO
✓ కొత్తగూడెం: లిక్విడ్ గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
✓ దుమ్ముగూడెం: విద్యుత్ షాక్‌తో వర్కర్‌కు గాయాలు