News December 13, 2025
NGKL: 147 గ్రామాలలో 473 మంది సర్పంచ్ అభ్యర్థులు

జిల్లాలో ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 147 గ్రామ పంచాయతీల్లో 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 151 గ్రామాలకు గాను 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 1412 వార్డులకు గాను 143 వార్డులు ఏకగ్రీవం కాగా 1269 వార్డులలో 3228 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, తిమ్మాజీపేటలలో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News December 13, 2025
కదిరిలో బాలుడిపై కుక్క దాడి.. తెగిన చెవి

కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీలో ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. వీధిలో ఉన్న బాలుడిపై దాడి చేసిన కుక్క నోటితో పట్టుకుని లాక్కెళ్లిపోయింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి కుక్కను తరిమివేశారు. ఈ దాడిలో బాలుడి చెవి సగం వరకు తెగిపడింది. గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కల సమస్యపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
News December 13, 2025
జగిత్యాల: 2499 మందికి నవోదయ పరీక్ష.. 1860 మంది హాజరు

జవహర్ నవోదయ విద్యాలయం 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. జగిత్యాలలో 4, మెట్పల్లిలో 2, కోరుట్ల, మల్యాల, ధర్మపురి, వెల్గటూరులో ఒక్కో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2,499 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,860 మంది పరీక్షకు హాజరై 74.42 శాతం హాజరు నమోదు అయింది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయి.
News December 13, 2025
MBNR: 2వ విడత ఎన్నికలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

రెండో విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 1,249 మంది పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ-1, అదనపు ఎస్పీలు-2, డిఎస్పీలు-7, ఇన్స్పెక్టర్లు-29, సబ్ ఇన్స్పెక్టర్లు-66, మిగతా సిబ్బంది-1,134 మంది పోలీస్ సిబ్బంది జిల్లాలోని హన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర, సీసీ కుంట, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాలలో విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


