News December 13, 2025
సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Similar News
News April 1, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనకు రంగం సిద్ధం

పంచాయతీల పాలకవర్గాల ఐదేళ్ల పాలన ఈనెల రెండుతో ముగియనుంది. గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 గ్రామపంచాయతీలు ఉన్నాయి. రెండు లేదా మూడు పంచాయతీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. మండలంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్లకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఇటీవల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
News April 1, 2026
శ్రీకాకుళం: అమ్మ..ఎందుకు ఇలా చేశావు

పిల్లలకు ఆపద వస్తే కన్నతల్లి మనస్సు విలవిల్లాడిపోతోంది. ఆ ప్రమాదానికి ఎదురెళ్లి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కుటుంబ తగాదాలకు మనస్సును చిన్నబుచ్చుకుంది. ప్రాణమైన చిన్నారులను రైలు కింద తోసి తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన <<19529246>>నరసన్నపేటలో<<>> మంగళవారం జరిగింది. భర్త మద్యం తాగొచ్చాడని జరిగిన గొడవలో మనస్తాపం చెందింది. క్షణికావేశంలో ఈమె తీసుకున్న నిర్ణయం పిల్లలను ఒంటరి చేసింది.
News April 1, 2026
శ్రీకాకుళం: 14 కంపెనీల్లో 245 మందికి ఉద్యోగాలు

శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా జరిగింది. 14 కంపెనీలు హాజరుకాగా జిల్లా నలుమూలల నుంచి 741 మంది ఇంటర్వ్యూలకు వచ్చారు. పలు కేటగిరీల్లో 245 మందికి ఎంపిక కాగా నియామక పత్రాలను శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి హయాంలో యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. జిల్లా ఉపాధికల్పనాధికారి సుధ ఉన్నారు.


