News December 13, 2025

ఓరుగల్లు ఓటరూ.. 100% పోలింగ్ చేయలేమా?

image

ఉద్యోగం నిమిత్తం పట్టణాలకు వలస వెళ్లిన జిల్లా ప్రజలు ఎన్నికలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. సెలవులు, సమయం లేక సొంతూరు వచ్చి ఓటేయట్లేదు. మీగ్రామం అభివృద్ధికి దూరమవడానికి ఇదికూడా కారణమే. మీరు ఎంచుకునే అభ్యర్థి ఐదేళ్లు చేసే అభివృద్ధిపైనే గ్రామం ఆధారపడుతుంది. రేపు ఎలాగూ సండే కాబట్టి ఊరెళ్లి ఓటేద్దాం. మొదటి విడతతో WGL-86.83, HNK-83.95, JNGM-87.33, MLG-78.65, MHBD-86.99, BHPL-82.26% మాత్రమే పోలింగ్ అయింది.

Similar News

News January 3, 2026

HYD: ఆ ముగ్గురిపై మరో అధికారి ఉండరు: కర్ణన్

image

మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటికి కొత్తగా ముగ్గురు కమిషనర్లు నియమితులవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ఆ ముగ్గురు అధికారులపై మరో ఉన్నతాధికారి ఉండబోరని స్పష్టం చేశారు. ఈ అధికారులు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గ్రేటర్ ఎన్నికలు పాలక మండలి ముగిసిన తరువాతే ఉంటాయని అసెంబ్లీ లాబీలో పేర్కొన్నారు.

News January 3, 2026

చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

image

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.

News January 3, 2026

మెదక్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగాలి: ఎస్పీ

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్లను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ విషయంలో అవగాహన ముఖ్యమన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్ ఉన్నారు.