News December 13, 2025
₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-14 మధ్య 7,599 KM న్యూ ట్రాక్ వేస్తే, 2014-24 వరకు తాము 34,428 KM నిర్మించామని తెలిపారు. ₹6,74,920 కోట్లతో కొత్త రైల్వే లేన్లు, మల్టీ ట్రాకింగ్, గేజ్ కన్వర్షన్ చేపట్టామన్నారు. ఇప్పటికే 12,769 KMల నిర్మాణం పూర్తయిందన్నారు. పెరుగుతున్న సరకు రవాణా దృష్ట్యా నెట్వర్క్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.
Similar News
News January 3, 2026
జీర్ణశక్తిని పెంచే ఫ్రూట్స్ ఇవే..

శీతాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఫైబర్, ఎంజైమ్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. నారింజ, కివి, దానిమ్మ, బొప్పాయి, జామపండు శీతాకాలంలో ఎక్కువగా తినాలి. ఇవి మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం తగ్గించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే గ్రేప్ ఫ్రూట్, బెర్రీలు, బెర్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శీతాకాలంలో బరువు పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు నిపుణులు.
News January 3, 2026
కాల్స్, మెసేజ్లు వేరేవాళ్లకు వెళ్తున్నాయా? ఇలా చెక్ చేసి ఆపేయండి!

‘అన్కండిషనల్ కాల్ ఫార్వర్డింగ్’ ద్వారా హ్యాకర్లు మీ కాల్స్, SMS, OTPలను వారి నంబర్కు మళ్లించే ప్రమాదం ఉంది. మొబైల్లో *#21# డయల్ చేస్తే మీ స్క్రీన్పై ఒక లిస్ట్ కనిపిస్తుంది. అందులో వాయిస్, డేటా, SMS వంటి వాటి పక్కన Not Forwarded అని ఉంటే మీ ఫోన్ సేఫ్. ఒకవేళ ఏదైనా నంబర్ కనిపిస్తే మీ సమాచారం లీక్ అవుతున్నట్టే. ఫార్వర్డ్ అవుతున్నాయని గుర్తిస్తే ##002# డయల్ చేసి అన్ని సెట్టింగ్లను రద్దు చేయొచ్చు.
News January 3, 2026
BSFలో 549 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<


