News December 13, 2025
యాదగిరిగుట్ట: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఒక మాసంపాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ధనుర్మాస ఉత్సవ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి ఉదయం 5 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపంపై ఉత్తర భాగాంలోని హాలులో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
Similar News
News January 8, 2026
BREAKING: పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం

పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫర్నిచర్ అంతా తగలబడి, దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
News January 8, 2026
పురుషులను కుక్కలతో పోల్చిన నటి.. నెటిజన్ల ఫైర్

మగాళ్లను కుక్కలతో పోల్చుతూ కన్నడ నటి రమ్య(దివ్య స్పందన) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కుక్క ఎప్పుడు కరిచే మూడ్లో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. వాటిని షెల్టర్లకు తరలించాలి’ అన్న <<18789967>>సుప్రీంకోర్టు కామెంట్లపై<<>> ఆమె స్పందించారు. ‘మగాళ్ల మైండ్ను కూడా చదవలేం. వాళ్లు ఎప్పుడు రేప్/మర్డర్ చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్స్టాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు ఫైరవుతున్నారు.
News January 8, 2026
రెండేళ్లలోపే ₹3.02 లక్షల కోట్ల అప్పు: జగన్

AP: 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ₹3,90,247 కోట్ల అప్పు ఉందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ‘మా హయాంలో ₹3,32,671 కోట్ల రుణాలు తీసుకుంటే ₹2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. చంద్రబాబు ఇప్పుడు రెండేళ్లలోపే ₹3,02,303 కోట్ల అప్పు చేశారు. కానీ అదంతా ఏం చేశారో తెలియదు. మేం సంక్షేమానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాబు అప్పులకు క్యాలెండర్ రిలీజ్ చేశారు’ అని ఎద్దేవా చేశారు.


