News April 20, 2024
శ్రీకాకుళం: ఎన్నికల పరిశీలకులను కలిసిన కలెక్టర్, ఎస్పీ

రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు నినా నిగమ్ జిల్లా పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం గౌరవ పూర్వకంగా ఆమెకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎస్పీ జి.ఆర్.రాధిక ఆహ్వానం పలికారు. అనంతరం జిల్లాలోని అనుసరిస్తున్న ఎన్నికల నియమావళి ప్రక్రియను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రతీ అధికారి అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News January 13, 2026
కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.


