News December 13, 2025
బాపట్ల జిల్లాలో అధికంగా ఎవరు మరణించారంటే..!

రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులేనని బాపట్ల SP ఉమామహేశ్వర్ తెలిపారు. ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనన్నారు. ఇటీవల చెరుకుపల్లిలో జరిగిన ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలవడం వల్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అనేక మంది బైక్ నడిపేవారే మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.
Similar News
News January 8, 2026
పవన్ వద్ద పంచాయితీ.. సదుం వాసుల వాదన ఇది.!

సదుంలో మైనింగ్ కోసం సేకరించిన<<18792414>> భూముల్లో<<>> అధికంగా డీకేటీ భూములు ఉండటంతో పరిహారం అంశం ప్రధాన సమస్యగా మారింది. భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా, పనులు ప్రారంభమైన తర్వాత పరిహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామ కమిటీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై రైతులు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పష్టమైన పరిష్కారం కనిపించలేదని వారు అంటున్నారు.
News January 8, 2026
MNCL: పదో తరగతి పరీక్షలకు ‘తత్కాల్’ ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష రుసుము చెల్లించలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2026 మార్చిలో జరగనున్న పరీక్షల కోసం తత్కాల్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యాదయ్య తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 21 నుంచి 27వ వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News January 8, 2026
రైళ్ల శుభ్రతపై భారీగా ఫిర్యాదులు

ట్రైన్లలో కోచ్ల శుభ్రత, బెడ్ రోల్స్కు సంబంధించి Rail Madad యాప్లో గత ఏడాది సెప్టెంబర్లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్ (13,406), నవంబర్ (13,196)లో సుమారు 50% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ‘సంతృప్తికర’ ఫీడ్బ్యాక్లు కూడా తగ్గాయి. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించింది.


