News December 13, 2025
జగిత్యాల: పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సిబ్బంది

జగిత్యాల జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది, సామగ్రి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. జగిత్యాల, జగిత్యాల రూరల్, సారంగాపూర్, మల్యాల, బీర్పూర్, రాయికల్, కొడిమ్యాల మండలాల్లోని 144 సర్పంచ్, 1276 వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1276 పోలింగ్ కేంద్రాలకు 1531 పీఓలు, 2036 ఏపీఓలు, రిటర్నింగ్ అధికారులు వాహనాల్లో చేరుకున్నారు.
Similar News
News January 3, 2026
GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.


