News April 20, 2024
బాలీవుడ్లో ‘పుష్ప-2’ ఆల్ టైమ్ రికార్డ్!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులు రూ.200 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. హిందీయేతర సినిమాకు బాలీవుడ్లో ఇంత ధర వెచ్చించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. పుష్ప సినిమా బ్లాక్బస్టర్ హిట్తో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
Similar News
News February 7, 2026
ఇస్లామాబాద్లో దాడి చేసింది మేమే: ఐసిస్

పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన <<19072203>>ఆత్మాహుతి దాడి <<>>తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ‘మసీదులోకి వెళ్లేందుకు యత్నించిన మా ఫైటర్ను గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమిగూడిన చోట అతడు తనను తాను పేల్చేసుకున్నాడు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటాక్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
News February 7, 2026
ఇలాంటి సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

గాఢ సేంద్రియ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.
News February 7, 2026
రోహిత్, కోహ్లీని డిమోట్ చేసిన బీసీసీఐ!

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిని గ్రూప్-Bకి డిమోట్ చేసినట్లు సమాచారం. A+ కేటగిరీని బోర్డు తొలగించిందని NDTV పేర్కొంది. గ్రూప్ Aలో గిల్, బుమ్రా, జడేజాకు చోటు కల్పించిందని తెలిపింది. రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ జడేజాను మాత్రమే గ్రూప్ Aలో ఎందుకు ఉంచారనేది తెలియాల్సి ఉంది.


