News December 14, 2025
నిజామాబాద్: వామ్మో చలి.. మూడు రోజులుగా వణుకు పుట్టిస్తోంది

గత మూడు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. కొందరు ఇళ్లలోనే మంట కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలామంది సర్ది, దగ్గు, జ్వరాల బారిన పడి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
Similar News
News January 26, 2026
నిజామాబాద్: కొందరికే భరోసా

భూమిలేని నిరుపేద కూలీలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో గతేడాది ఇదే రోజు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ప్రారంభించింది. నిజామాబాద్ జిల్లాలో 38,787 మందిని లబ్ధిదారులుగా గుర్తించగా కేవలం 1,675 మందికే తొలి విడత సాయం అందింది. ఇంకా 37,112 మంది ఎదురుచూస్తున్నారు. ఏడాది గడిచినా నిధులు విడుదల కాకపోవడంతో అర్హులైన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News January 26, 2026
రిపబ్లిక్ డే వేడుకకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
News January 26, 2026
రిపబ్లిక్ డే వేడుకకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


