News December 14, 2025

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

image

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <>Xలో<<>> దుయ్యబట్టింది. ‘గత రెండేళ్లలో రాష్ట్రంలో 828 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 117 మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందిపడ్డారు’ అని రాసుకొచ్చింది. రాష్ట్ర ప్రజలు మీ మోసాన్ని గుర్తుంచుకుంటారని పేర్కొంది.

Similar News

News January 12, 2026

కొనసాగుతున్న రూపాయి పతనం

image

ఈ వారం మార్కెట్‌ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

News January 12, 2026

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. కారణాలివే

image

నేడు స్టాక్ మార్కెట్ సూచీలు ఆరంభం నుంచే భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. 1. ట్రంప్ సర్కార్ భారత్‌పై భారీగా సుంకాలు విధిస్తుందన్న భయాలు. 2. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం. 3.TCS వంటి బడా కంపెనీల Q3 ఫలితాలపై ఆందోళన. 4. ఇరాన్‌ అల్లర్లు సహా అంతర్జాతీయ ఉద్రిక్తతలు.

News January 12, 2026

‘ఈ-ఫార్ములా’ కేసులో మరిన్ని వివరాలు కోరిన కేంద్రం

image

TG: E-ఫార్ములా కేసులో IAS అధికారి అరవింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని కేంద్రాన్ని GOVT DECలో కోరింది. విదేశీ కంపెనీకి ₹55Cr విడుదల చేయడంలో ఆయన పాత్ర ఉందని నివేదించింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించాలని కేంద్రం తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. IASపై వచ్చిన అభియోగాలు నిజమో కాదో తేలిన తరువాతే నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రం అందించే సమాచారం సంతృప్తికరంగా ఉంటే అనుమతిస్తుంది.