News December 14, 2025
గోవా, కేరళకే పర్యాటకుల ఓటు: సర్వే

చలికాలంలో ప్రయాణాలకు గోవా, కేరళకే దేశీయ పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. ఎయిర్బీఎన్బీ చేసిన సర్వేలో 55% మంది వీటినే టాప్ ఛాయిస్లుగా ఎంచుకున్నారు. సెలవులకు మాత్రమే కాకుండా రిలాక్స్ అయ్యేందుకు, బీచ్లు, బ్యాక్ వాటర్, హెరిటేజ్ వంటి ఆకర్షణలు ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. అటు యువత వారణాసి, బృందావన్ వంటి ఆధ్యాత్మిక పర్యటనలను ఎంచుకుంటున్నారని వెల్లడించింది. మీరు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారు?
Similar News
News January 13, 2026
రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన స్కిల్ కేసు!

AP: స్కిల్ <<18842559>>కేసులో<<>> CBN అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. 2024లో TDP నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడానికి ఈ కేసు కారణమైంది. CBN జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి రోడ్లపై నిరసనలకు దిగారు. పవన్ కళ్యాణ్ జైల్లో ఆయనను పరామర్శించి TDPతో పొత్తును ప్రకటించారు. BJP కూడా కలిసిరావడంతో 2024లో కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీ ఘోర పరాభవం ఎదుర్కొంది.
News January 13, 2026
పిండివంటల కోసం ఈ చిట్కాలు

* పిండి వంటలు చేసేటపుడు నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
* వంటగది గట్టు మీద జిడ్డు పోవాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.
*వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.
News January 13, 2026
కోడి పందెం బరులు.. బౌన్సర్లు సిద్ధం!

AP: సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. షామియానాలు, సెక్యూరిటీ, బౌన్సర్లు, జనరేటర్లు, పార్కింగ్ స్థలాలు, తదితరాలకు నిర్వాహకులు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అతిథుల కోసం బుక్ చేస్తున్న రూముల కోసం 3 రోజులకు గానూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా భీమవరం ఏరియాలో రూముల కోసం భారీగా డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.


