News December 14, 2025

తిరువూరు తలనొప్పి.. MLA vs MP పోరుపై బాబు చర్యలుంటాయా.?

image

తిరువూరు నియోజకవర్గంలో MLA vs MP వర్గాల ఆధిపత్య పోరు TDP అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. వీరి విమర్శలు పార్టీపై ప్రభావం చూపుతాయేమోనని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు అధిష్ఠానం పెద్దలు మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో, CM చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకుని గట్టిగా మందలిస్తే తప్ప ఈ గొడవలు ఆగేలా లేవని నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Similar News

News January 15, 2026

హైదరాబాద్‌లో అత్యంత ధనవంతులు

image

1. మురళి దివి & ఫ్యామిలీ: రూ.91,100 కోట్లు (దివిస్ ల్యాబరేటరీ) 2. P. పిచ్చిరెడ్డి: రూ.42,650 కోట్లు (MEIL) 3. P.V. కృష్ణారెడ్డి: రూ.41,810 కోట్లు (MEIL) 4. పార్థసారథి రెడ్డి: రూ.39,030 కోట్లు (హెటిరో ఫార్మా) 5. డా.రెడ్డీస్ ఫ్యామిలీ: రూ.39,000 కోట్లు 6. PV రామ్ ప్రసాద్ రెడ్డి: రూ.35,000 కోట్లు (అరబిందో ఫార్మా) 7.సురేందర్ సాలుజా 8.జూపల్లి రామేశ్వర్ రావు
>ఫోర్బ్స్ & హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం

News January 15, 2026

మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్

image

TG: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. కాగా గత నెలలో ఫిరాయింపులకు సరైన ఆధారాల్లేవని <<18592868>>ఐదుగురు<<>> MLAలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్‌కు వివరణ ఇచ్చుకోలేదు.

News January 15, 2026

తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజులు జరిగిన ధనుర్మాస కైంకర్యాలు నిన్నటితో ముగిశాయి. డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 14వరకు ధనుర్మాసం సాగింది. ఈ సందర్భంగా సుప్రభాత సేవ నిలిపేశారు. తిరుప్పావై పాశురాల పారాయణంతో స్వామివారిని మేల్కొలిపారు. ధనుర్మాసం ముగియడంతో గురువారం వేకువజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు పూర్తి చేశారు.