News December 14, 2025

అనకాపల్లిలో ఈనెల 17న మెగా జాబ్ మేళా

image

అనకాపల్లి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన అనకాపల్లి ఆదినారాయణ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, పీజీ చేసి 18-40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గలవారు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. 52 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు.

Similar News

News February 2, 2026

BREAKING: వరంగల్‌లో కిడ్నాప్ కలకలం

image

వరంగల్ కొత్తవాడలో సోమవారం సాయంత్రం ఓ బాలుడి(13)పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడ్డారని అతని తల్లి ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరణాకర్ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 2, 2026

కృష్ణా: ‘విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి’

image

పెనమలూరు నియోజకవర్గం పోరంకి BJR నగర్‌లోని చైతన్య విద్యా సంస్థల్లో పవన్ అనే విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన PGRSలో జిల్లా అధ్యక్షులు పూజిత, కార్యదర్శి సమరం కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. తోటి విద్యార్థుల ముందు పవన్‌ను ప్రిన్సిపల్ అవమానకరంగా మాట్లాడినందుకు ఆత్మహత్య చేసుకున్నాడని SFI నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

News February 2, 2026

పోలీస్ శాఖ పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు: ఎస్పీ

image

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. సోమవారం భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన పాల్గొని ప్రజల నుంచి 23 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో పాటు సైబర్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.