News December 14, 2025
పెద్దపల్లిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు: DCP

పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీసీపీ బి.రామ్ రెడ్డి తెలిపారు. అంతర్గం మండలం కుందన్పల్లి, పెద్దంపేట్, ఎల్లంపల్లి, మూర్ముర్, గోళీవాడ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. భద్రతా చర్యలు, సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై సమీక్షించారు. ప్రజలు భయాందోళనలేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించాలని కోరారు.
Similar News
News December 16, 2025
కరీంనగర్: SU M.Ed పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగనున్న M.Ed 1వ, 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా DEC 24 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.500తో DEC 30 వరకు చెల్లించుకోవచ్చని SU పరీక్షల నియంత్రణ అధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలు JAN 2026 లో జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలన్నారు.
News December 16, 2025
బరువు తగ్గినప్పుడు ఫ్యాట్ బయటికెలా వెళ్తుంది?

శరీరంలో కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ ఉంటుంది. డైట్, వ్యాయమం వల్ల కేలరీలు తగ్గించినప్పుడు శరీరం ఆ కొవ్వును ఆక్సిడైజ్ చేసి శక్తిగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో ఫ్యాట్ కరిగి కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా విడిపోతుంది. 84% కార్బన్ డై ఆక్సైడ్గా మారి ఊపిరితో, 16% నీరుగా మారి చెమట, యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి. ఉదా. 10కిలోల ఫ్యాట్ తగ్గితే 8.4KGలు C02గా ఊపిరి ద్వారా, 1.6KGలు నీరుగా విసర్జింపబడతాయి.
News December 16, 2025
లిస్టులోకి మరో 19మంది ప్లేయర్లు.. నేడే మినీ వేలం

IPL మినీ వేలం లిస్టులో అభిమన్యు ఈశ్వరన్తో సహా 19 మంది ప్లేయర్లు చేరారు. దీంతో ఆక్షన్లో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369కి చేరింది. వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం కొత్త విషయం కాకపోయినా ఇంతమంది యాడ్ కావడం ఇదే తొలిసారి అని BCCI తెలిపింది. నేడు గరిష్ఠంగా 77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ 2.30PM నుంచి అబుదాబిలో ఆక్షన్ ప్రారంభం కానుంది. KKR పర్సులో అత్యధికంగా రూ.64.30CR ఉన్నాయి.


