News December 14, 2025

పాలమూరు: ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 565 గ్రామ పంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గేటు లోపల ఉన్న ఓటర్లకు అనుమతించి పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్లను లెక్కించనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Similar News

News January 9, 2026

అన్నమయ్య: 12 తర్వాత ఎప్పుడైనా సమ్మె

image

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈనెల 12వ తేదీ తర్వాత ఏ క్షణమైన సమ్మెకు వెళ్తామని CITU జిల్లా గౌరవ అధ్యక్షుడు రామాంజులు, జిల్లా అధ్యక్షుడు రమణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ చలపతి తెలిపారు. 108 కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లెలోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట గురువారం నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో మధుసూదన్‌కు సమ్మె నోటీస్ ఇచ్చారు.

News January 9, 2026

సంగారెడ్డి: ఈనెల 18 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని రకాల జూనియర్ కళాశాలలకు రేపటి నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. సెలవుల అనంతరం తిరిగి 19న కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డీఐఈవో స్పష్టం చేశారు.

News January 9, 2026

వరంగల్ జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని యాసంగి 2025- 26 పంటల సాగుకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ యాసంగి పంటకు 19770 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 9770 మెట్రిక్ టన్నుల జనవరి మాసంలో రైతులకు అవసరం మేరకు అందించడం జరుగుతుందన్నారు.