News December 14, 2025
వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @1PM

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా 1PM గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 83.9% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 79.6%, కొత్తకోట 84.5%, మదనాపూర్ 86.2%, ఆత్మకూరు 83.8%, అమరచింత 89.2% పోలింగ్ నమోదైంది.
Similar News
News January 16, 2026
బంపరాఫర్.. లేఖ రాస్తే రూ.50వేలు, స్విట్జర్లాండ్ పర్యటన!

విద్యార్థులకు CBSE రైటింగ్ కాంపిటేషన్ ప్రకటించింది. డిజిటల్ యుగంలో మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో వివరిస్తూ స్నేహితుడికి లేఖ రాయాలని తెలిపింది. 9-15 ఏళ్ల విద్యార్థులను అర్హులుగా పేర్కొంటూ మార్చి 20లోపు స్కూళ్లు రిపోర్టులు సమర్పిస్తే విజేతలను ఎంపిక చేస్తామంది. విజేతలకు సర్కిల్, జాతీయ స్థాయిలో రూ.5-50వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జాతీయ స్థాయిలో విజేతకు స్విట్జర్లాండ్ పర్యటనకు ఛాన్స్ ఇస్తామంది.
News January 16, 2026
TODAY HEADLINES

⭒ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
⭒ మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN
⭒ దేశ భద్రత విషయంలో TG ముందుంటుంది.. ఆర్మీ అధికారులతో CM రేవంత్
⭒ రాయలసీమ లిఫ్ట్ను KCRకు జగన్ తాకట్టు పెట్టారు: సోమిరెడ్డి
⭒ TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్కు స్పీకర్ క్లీన్ చిట్
⭒ BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
⭒ U19 WC: USAపై IND గెలుపు
News January 16, 2026
మంచిర్యాల: పండగ పూట విషాదం

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నూరు మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానిక పెట్రోల్ బంక్ ఏరియా శనగకుంట ప్రాంత సమీపంలో రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


