News December 14, 2025

గద్వాల: నాలుగు మండలాల్లో 95,592 ఓట్లు నమోదు

image

గద్వాల జిల్లాలో 2వ విడతలో ఎన్నికలు జరిగిన 4 మండలాల్లో 1,12,087 మంది ఓటర్లు ఉండగా 95,592 మంది ఓటు వేశారు. అయిజ మండలంలో 39,377 మంది ఓటర్లకు 32,563 మంది, మల్దకల్ మండలంలో 37,915 మంది ఓటర్లకు 30,548 మంది, వడ్డేపల్లి మండలంలో 7,477 మంది ఓటర్లు ఉండగా 6,442 మంది, రాజోలి మండలంలో 28,038 మంది ఓటర్లకు 23,039 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Similar News

News January 12, 2026

గద్వాల్: నేడు పలు మండలాల్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీ

image

గ్రామీణ క్రీడాకారులను ప్రపంచస్థాయి విజేతలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. గద్వాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నేడు గద్వాల ఇండోర్ స్టేడియం నుంచి టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కృష్ణయ్య ప్రకటనలో పేర్కొన్నారు. ధరూర్, కేటి దొడ్డి, గట్టు, మల్దకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో టార్చ్ ర్యాలీ ఉంటుందన్నారు.

News January 12, 2026

కేటీఆర్ పాలమూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. HYD నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి MBNRకు చేరుకుంటారు. 11 గంటలకు పట్టణంలోని పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లాలో నూతనంగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లను కేటీఆర్ సన్మానించనున్నారు.

News January 12, 2026

కర్నూలు: ఉ.10 నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండి శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.