News December 14, 2025

రాజమండ్రి: రికార్డులు లేని 68 బైక్‌లు సీజ్

image

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.

Similar News

News March 7, 2026

పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్‌ కీర్తి చేకూరి

image

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు పహారా, రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.

News March 6, 2026

సకాలంలో ఇంటి పనులు చెల్లించాలి: కలెక్టర్ కీర్తి చేకూరి

image

జిల్లాలోని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయితీలకు సహకరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీలలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర పన్నులు, గత సంవత్సరాల బకాయిలతో కలిపి మొత్తం రూ.126.71 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.64.07 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News March 6, 2026

తూ.గో: టెన్త్ విద్యార్థులకు GOOD NEWS

image

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని డీపీటీఓ మూర్తి తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. తూ.గో జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.