News December 14, 2025
MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.
Similar News
News January 8, 2026
మెదక్: ఈనెల 10 నుంచి డ్రాయింగ్ గ్రేడ్ పరీక్షలు

డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలు ఈనెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు డిఈఓ విజయ తెలిపారు. మెదక్ బాలికల పాఠశాల కేంద్రంగా ఉ. 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమతో పాటు పెన్సిళ్లు, రంగులు, రైటింగ్ ప్యాడ్లు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరికరాలను తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.
News January 8, 2026
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన కలెక్టర్, బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన అందించాలన్నారు.
News January 8, 2026
మెదక్: తీవ్ర విషాదం.. బురదలో రైతు మృతి

కౌడిపల్లి మండలంలో మర్రి చెట్టు తండాలో పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడి గిరిజన రైతు మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మర్రి చెట్టు తండా చెందిన కాట్రోత్ దినాకర్(28) తన పొలంలో వరి నాటు కోసం పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు జారి బురదలో పడిపోయాడు. స్థానిక రైతులు చూసి దినాకర్ను లేపి చూడగా, అప్పటికే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


