News April 20, 2024

గుంటూరు: విధుల్లో పాల్గొనే విలేకర్లకు పోస్టల్ బ్యాలెట్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధుల్లో పాల్గొనే విలేకర్లకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని కలెక్టర్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్ అథారిటీ లేఖలు పొందిన విలేకర్లు మాత్రమే, కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సెంటర్లో ఫార్మ్-12డి పొంది పూర్తిచేసి, వాటితో పాటు ఓటర్ ఐడి, అక్రిడిటేషన్ నకలు జతచేసి ఈ నెల 21సాయంత్రం 6గంటలలోగా అందజేయాలన్నారు.

Similar News

News March 14, 2026

తెనాలిలో ఇనుప చట్రంతో పొట్టి శ్రీరాములు అద్భుత విగ్రహం

image

తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఈ నెల 16న పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 2 టన్నుల ఐరన్ స్ర్కాప్‌‌తో తయారు చేసిన విగ్రహాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు. ఇంద్రకీలాద్రి పాలక మండలి సభ్యులు తోటకూర రమణారావు, బీసీ సంఘ అధ్యక్షుడు కేసన శంకరరావు విగ్రహాన్ని తిలకించి శిల్పులను అభినందించారు.

News March 14, 2026

పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: గుంటూరు ఎస్పీ

image

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SSS పరీక్షల కోసం గుంటూరు జిల్లాలో 149 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా SP వకుల్ జిందాల్ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు ఉండగా, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు. మాల్‌ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News March 14, 2026

అమరావతిలో స్థలం ఇస్తే స్టూడియో నిర్మిస్తాం: దిలీప్ రాజా

image

అమరావతిలో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్టూడియో నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని మా-ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రభుత్వానికి మనవి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో సినిమా షూటింగ్‌లకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. సినిమా షూటింగ్‌లకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం బాధాకరమని పేర్కొన్నారు. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని, దీనిపై స్పందించాలని కోరారు.