News April 20, 2024
ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి: పురందీశ్వరి

AP: రాజానగరంలో BJP, JSP ఉమ్మడి ప్రచార సభలో CM జగన్పై పురందీశ్వరి విమర్శలు గుప్పించారు. ‘ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని జగన్ అంటున్నారు. కానీ ఫ్యాన్ స్పీడ్ 1,2,3 లేదా నాలుగులోనే ఉండాలి. మనం దాన్ని 151లో పెట్టాం. దీంతో మన ఇంటి పైకప్పు లేచిపోయింది. గోడలు కూలిపోయాయి. ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి’ అని పిలుపునిచ్చారు. జగన్కు అధికారం ఇస్తే తల లేని మొండెంలా APని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు.
Similar News
News March 26, 2026
50ల్లోనూ యవ్వనంగా.. మలైకా సీక్రెట్ ఇదే?

3 రకాల వాటర్ షాట్స్ థెరపీ 52 ఏళ్ల వయసులోనూ తనను ఫిట్&అందంగా ఉంచుతోందని మలైకా అరోరా తెలిపారు.
ఇమ్యూనిటీ షాట్: అల్లం, పసుపు, పుదీనా, తులసి ఆకులు, చియా సీడ్స్, తేనె కలిసిన నీటిని తాగడం.
డైజెస్టివ్ షాట్: రాత్రి గ్లాస్ వాటర్లో టీస్పూన్ చొప్పున వాము, జీలకర్ర, సోంపు, మెంతి గింజలు నానబెట్టిన నీరు తీసుకోవడం.
గ్లో షాట్: అలోవేరా జెల్ కలిపిన నీటిలో అవసరమైతే చియా సీడ్స్, సబ్జా గింజలు యాడ్ చేసుకొని తాగడం.
News March 26, 2026
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, ఆసిఫాబాద్, సంగారెడ్డి, MDK, కామారెడ్డిలో ఉరుములు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HYD, WGL, జనగామ, SDPT, యాదాద్రి, RR, మేడ్చల్, MBNR, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, PDPL, నాగర్ కర్నూల్, వనపర్తి, NRPT, GDWL జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News March 26, 2026
రాష్ట్రంలో కాగితాలపైనే పోలీసులు: జగన్

AP జంగిల్ రాజ్గా మారిపోయిందని, కాగితాలపై మాత్రమే పోలీసులు కన్పిస్తున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో 17ఏళ్ల గిరిజన బాలికపై హత్యాచారం వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. ఇక ఇవాళ మార్కాపురం ఘటనలో మరో భయానక వైఫల్యం బయటపడిందన్నారు. పలుమార్లు 100కు ఫోన్ చేసినా స్పందించలేదని చెప్పారు. CBN ప్రభుత్వంలో PR స్టంట్లు తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు.


