News December 15, 2025

జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.

Similar News

News February 6, 2026

పొదిలిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న రథం

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన పొదిలిలోని శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి రథోత్సవానికి ముస్తాబు మొదలైంది. శుక్రవారం ఆలయ ఛైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య, దాత నాగేశ్వరరావు రథం అలంకరణ పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. మహాశివరాత్రి పర్వదినాన అత్యంత వైభవంగా జరిగే ఈ రథోత్సవంలో భారీగా భక్తులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

News February 6, 2026

సంతనూతలపాడు వద్ద గంటలు తరబడి ట్రాఫిక్

image

సంతనూతలపాడులో ఎండ్లూరు డొంక వద్ద రహదారిపై ఉన్న కల్వర్టు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా సంతనూతలపాడు నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై నుంచి భారీ వాహనం భారీ లోడుతో కల్వర్టుపైకి రాగానే ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

News February 6, 2026

ఉమ్మడి ప్రకాశం: 10th పరీక్షల ఫీజు గడువు పెంపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే రెగ్యులర్/ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం తత్కాల్ పరీక్ష ఫీజు ఆలస్య రుసుముతో చెల్లించడానికి గడువు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా DEO రేణుక చెప్పారు. రూ.1,000 ఫైన్‌తో ఈనెల 12వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం గమనించాలని సూచించారు.