News December 15, 2025
ఇవాళ కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి శాంతి వనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు. తర్వాత యోగా, వెల్నెస్ సెంటర్లను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం విజయవాడలో జరిగే పొట్టిశ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాలలో ఒకటిగా ఉంది.
Similar News
News March 13, 2026
ఈ యాప్ గురించి మీకు తెలుసా?

మీ ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందా? మూగజీవి చనిపోయి కుళ్లిన వాసనతో ఇబ్బంది పడుతున్నారా? వీటి గురించి కంప్లైంట్ చేసేందుకు ‘Swachhata’ అనే యాప్ ఉంది. వివిధ సమస్యలను ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తే చాలు. నేరుగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. నిర్ణీత సమయంలోగా అధికారులు ఆ సమస్యను పరిష్కరించి, ఫొటోను అప్లోడ్ చేస్తారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది.
News March 13, 2026
సీఎం రేవంత్ ఎంత ఐటీ చెల్లించారంటే?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందే జీతంపై ఆదాయపు పన్ను చెల్లించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సీఎం తరఫున ప్రభుత్వం రూ.1,04,054 పన్ను చెల్లించింది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే సాధారణ పరిపాలన శాఖ (GAD) సీఎం, మంత్రుల ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసి పన్నులు చెల్లిస్తుంది.
News March 13, 2026
షేమ్ ఆన్ యూ కావ్యా మారన్.. SMలో ట్రోలింగ్

హండ్రెడ్ లీగ్ సన్రైజర్స్లోకి PAK బౌలర్ <<19368622>>అబ్రార్ను<<>> తీసుకోవడంతో ఓనర్ కావ్యా మారన్పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాక్ ప్లేయర్ను కొనడం టెర్రరిజాన్ని ప్రోత్సహించడమేనని మండిపడుతున్నారు. ‘Shame on you kavya maran’ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై BCCI వైస్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. IPL మినహా ఇతర లీగుల్లో ఎవరిని తీసుకోవాలనేది ఫ్రాంచైజీల ఇష్టమన్నారు.


