News April 20, 2024

ఎన్నికల అఫిడవిట్‌‌: నేతల ఆస్తులు ఎంతంటే!

image

AP: నెల్లూరు MP అభ్యర్థి వేమిరెడ్డి, ఆయన భార్య కోవూరు TDP అభ్యర్థి ప్రశాంతిల ఆస్తులు రూ.715 కోట్లు
➥ పారిశ్రామిక వేత్త, ఒంగోలు TDP MP అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చరాస్తులు రూ.4,58,40,319, స్థిరాస్తులు రూ.1.09 కోట్లు. చేతిలో ఉన్న నగదు రూ.18529.. భార్య పేరుతో చరాస్తులు రూ.17,96,70,139, స్థిరాస్తులు రూ.30,04,44,600.
➥కావలి TDP అభ్యర్థి వెంకటకృష్ణారెడ్డి ఆస్తి రూ.153.27 కోట్లు. కారు లేదు.

Similar News

News October 15, 2024

ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా మెండిస్

image

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నిలిచారు. సెప్టెంబర్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఈ ఏడాది ఆయన రెండు సార్లు ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు మెండిస్ కూడా ఆయన సరసన చేరారు.

News October 15, 2024

ఆ కేసులను ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ చేయాలి: CM

image

AP: శ్రీసత్యసాయి(D) నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సామూహిక <<14338493>>అత్యాచారం<<>> కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసు విచారణపై అధికారులతో సమీక్షించారు. గతంలో బాపట్లలో మహిళపై సామూహిక హత్యాచారం ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు. హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు.

News October 15, 2024

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు

image

AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.