News December 15, 2025
WGL: బ్యాలెట్ పేపర్ ఓటు వినియోగంలో తప్పిదాలు!

ఉమ్మడి జిల్లాలో 2వ దశ పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ విధానంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్ర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. వృద్ధులకు ఓటు ఎలా వేయాలో తెలియలేదట. యువత సైతం కొంత మంది ఇదే తోవలో నడిచారు. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ బదులు వేలి ముద్ర వేయడం, గుర్తుపై కాకుండా మడత పెట్టీ ఇచ్చిన పేపర్పై స్వస్తిక్ వేయడం, కొంత మంది రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తే ఒకటే వేసి మరొకటి జేబులో పెట్టుకున్నారట.
Similar News
News December 16, 2025
NRPT: ఈనెల 18న T-20 లీగ్ క్రికెట్ జట్టు ఎంపికలు

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 18న MDCA, జీ వెంకటస్వామి కాక మెమోరియల్, HCA ఆధ్వర్యంలో T-20 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ ఇన్ఛార్జ్ రమణ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఆసక్తి గల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 ఫొటోలతో ఉదయం 9 గంటలలోపు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 91007 53683 చరవాణికు సంప్రదించాలన్నారు.
అవసరమైన వారికి SHARE IT.
News December 16, 2025
మచిలీపట్నం: ‘అటల్-మోదీ’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే.!

నేడు మచిలీపట్నం రానున్న ‘అటల్-మోదీ’ సుపరిపాలన బస్సు యాత్ర రూట్ మ్యాప్ను ఆ పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మూడు స్థంభాల సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చల్లరాస్తా సెంటర్, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్, డీ మార్ట్ రోడ్డు మీదుగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్కు చేరుకుంటుంది. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
News December 16, 2025
విజయనగరం: దేశంలో తొలి AAD ఎడ్యుకేషన్ సిటీ.!

విజయనగరం జిల్లా భోగాపురంలో దేశంలోనే తోలి ఏవియేషన్ ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఏడ్యుకేషన్ సిటీని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో నేడు లాంఛనంగా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. జీఎంఆర్-మాన్సాస్ ఆధ్యర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలో 160 ఎకరాల స్థలంలో స్థాపించనున్నారు. ఈకార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనున్నారు. ఇప్పటికే లోకేశ్ విశాఖకు చేరుకున్నారు.


